Home » POW : 24న POW ఐక్యత సభ

POW : 24న POW ఐక్యత సభ

POW : మంచిర్యాల జిల్లా కేంద్రంలో జనవరి 24న ప్రగతిశీల మహిళ సంఘం (POW) ఐక్యత సభను నిర్వహించనున్నామని సంఘం పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షురాలు డీ బుచ్చమ్మ తెలిపారు. గోదావరిఖని పట్టణంలోని ఐ ఎఫ్ టీ యు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బావ సారూప్యత కలిగిన మహిళ సంస్థలన్నీ ఒకే తాటి మీదికి రావాలనే అభిప్రాయం బలంగా వ్యక్తం అయిందన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 24 న మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెండు రాష్ట్ర కమిటిలుగా ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం ఒకటి గా ఐక్యత కాబోతున్నాయని బుచ్చమ్మ వివరించారు. ఈ సభను విజయవంతం చేయడానికి మహిళలు అధిక సంఖ్యలో వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా బుచ్చమ్మ కోరారు. ఈ సందర్బంగ విలీన సభకు సంబందించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) జిల్లా కోశాధికారి ఈ మంగ తోపాటు బండ పద్మ, కుందారపు శారద, పీ సమ్మక్క, రాధక్క.తదితరులు పాల్గొన్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *