SINGARENI : తెలంగాణ సాధన కోసం తట్టా, చెమ్మస్ మూలకేసారు. బొగ్గు గణిలోకి దిగలేదు. బొగ్గు దగాయించలేదు. లాడీసు బంకర్ వద్దకు రాలేదు. సమ్మె సైరన్ మోగించారు. బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎవరు చెప్పిన వినేది లేదంటూ సింగరేణి బొగ్గు గని ముఖం చూడలేదు. సింగరేణి బొగ్గుగని కార్మికులు సమ్మెకు దిగి తెలంగాణ ఉద్యమ బాట పట్టిన తరువాత తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్కరుగా ఉద్యమం బాట పట్టారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నడుం బిగించిన నల్ల సూరీళ్ళకు గడిచిన పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎమన్నా చేసిందా అంటే గొప్పగా చెప్పుకోడానికి ఏమి లేదని కార్మిక వర్గం చెబుతోంది. కానీ కొత్తగూడెం బస్సు యాత్రలో తెలంగాణ ఉద్యమ కారుడు, పదేళ్లు రాష్ట్రాన్ని కనుసైగలతో పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పడం విశేషం.
సింగరేణి గని కార్మికులకు లాభాల వాటా ఇస్తున్నామన్నారు. ఇందులో కేసీఆర్ గొప్పతనం అంటూ ఏమిలేదు. తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ లో కార్మికులకు హామీ ఇచ్చారు. సంస్థను లాభాల్లోకి తీసుకురండి. సమ్మె బాట పట్టకండి. సాధించిన లాభాల్లో మీకు పది శాతం వాటా ఇచ్చే భాద్యత నాది అంటూ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతా హామీ ఇచ్చారు. కార్మికులు సమ్మెలోకి వెళ్లకుండా లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించారు. మాట ప్రకారం చంద్రబాబు నాయుడు పది శాతం లాభాల వాటా పంపిణీ చేయడం జరిగింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండ వాటా కార్మికులకు వస్తూనే ఉంది. చంద్రబాబు తరువాత రాజశేఖర్ రెడ్డి కొనసాగించారు. ఆయన తరువాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డ్ కూడా లాభాల వాటా కొనసాగించారు. తెలంగాణ వచ్చిన తరువాత లాభాల వాటా ను కొత్తగా ఇచ్చినట్టు కేసీఆర్ చెప్పుకోవడం పై కార్మికులు ముక్కున వేలేసుకుంటున్నారు.
పదేళ్ల కాలంలో కేసీఆర్ ఒక్క కార్మిక కుటుంబాన్ని పరామర్శించినది లేదు. గని ప్రమాదాలు జరిగినప్పుడు గతంలో కొత్తగూడెంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, గోదావరిఖనిలో నారా చంద్రబాబు నాయుడు గణిలోకి దిగి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. కానీ కేసీఆర్ మందమర్రి ఏరియాలోని శాంతి ఖని గని [ప్రమాదంలో నలుగురు కార్మికులు చనిపోతే పరామర్శించడానికి ప్రగతి భవన్ దాటి రాలేదు. అంతే కాదు ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా రాలేదు. ఉద్యమం చేబట్టిన నల్ల సూరిళ్లను కేసీఆర్ ఎలా చూశాడో అనడానికి ఇది ఒక తార్కాణం.
గడిచిన పదేళ్ల కాలంలో సుమారుగా పది బొగ్గు గనులు మూతపడ్డాయి. సింగరేణిలో ఆరు కొత్త గనులను నిర్మిచబోతున్నామని 2018 లో హామీ ఇచ్చారు. కనీసం ఒక్క కొత్త గని కూడా రాలేదంటే కేసీఆర్ కు సింగరేణి పై ఎంత ప్రేమ ఉందొ చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రం కొత్త బొగ్గు గనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభిస్తే సంస్థ పాల్గొనకుండా ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
కాంట్రాక్టు అనే పదం ఉండవద్దు అని ప్రకటించిన కేసీఆర్ సింగరేణిలో కనీసం అరవై వేల మంది భూగర్భంతో పాటు ఉపరితలంలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో కొందరిని పర్మినెంట్ చేశారు.అదే పని సింగరేణిలో ఎందుకు చేయలేదు అంటూ కార్మికులు తాజా మాజీ సీఎం కేసీఆర్ కొత్తగూడెం చేసిన ప్రగల్భాలను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.
సింగరేణిలో మీరు పురుడు పోసి పేరు పెట్టిన కార్మిక సంఘంకు చెందిన కొందరు నాయకులు కార్మికులను వేధించి జేబులు నింపుకున్న విషయం మీకు తెలియదా ??. తెలియదంటే మీ నిఘా వర్గాలు ఏమి చేసినట్టు. కొందరి నాయకుల పనితీరు పై మీకు సమాచారం ఉన్నా మీరు ఎందుకు పట్టించుకోలేదంటూ కొత్తగూడెం వేదికను కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
సంస్థ బ్యాంకు ఖాతాల్లో ఎప్పుడు సొమ్ము నిల్వ ఉండేది. వేతనాలు ఇవ్వగా మిగులు సొమ్ము ఉండేది. ఆ నిల్వ ఉన్న సొమ్ము కోసం బ్యాంకు అధికారులే అప్పు కోసం సింగరేణి సంస్థ చుట్టూ తిరిగేవారు. మీ పరిపాలనలో అభివృద్ధి చెందిన సంస్థ ఇప్పుడు వేతనాలు ఇవ్వడానికి సరిపడేంత సొమ్ము లేక సింగరేణి అధికారులు అప్పు కోసం బ్యాంకుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు ??. దీనికి కారణం ఎవరంటూ సింగరేణి పేరును ఆకాశానికి ఎత్తిన మాజీ సీఎం కేసీఆర్ ను కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
—————————-
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-