22.2 C
Munich
Friday, August 7, 2026

రేపు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరం

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు రేపు (ఆగస్టు 7) ఉదయం 9 గంటలకు బీబీపేటలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వాసవి క్లబ్ బీబీపేట, శ్రీ మణికంఠ భారత గ్యాస్ (దోమకొండ) సంయుక్త ఆధ్వర్యంలో, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మరియు కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని, ఈ నేపథ్యంలో యువత, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మానవతా సేవలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

శిబిరంలో పాల్గొనే ప్రతి రక్తదాతకు ప్రశంసా పత్రంతో పాటు ఒక కీ చైన్‌ను అందజేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీ మణికంఠ భారత గ్యాస్ తరఫున ప్రతి రక్తదాతకు ఒక వాటర్ బాటిల్‌ను బహుమతిగా అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, శ్రీ మణికంఠ భారత గ్యాస్ నిర్వాహకుడు బాశెట్టి నాగేశ్వర్, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు నీల బాలచంద్రం విజ్ఞప్తి చేశారు.

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.