13.2 C
Munich
Tuesday, July 28, 2026

Mela : కుంభమేళాకు ఆ ఆరు రోజులు పవిత్రమైనవి

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

Mela : మహా కుంభ మేళ జనవరి 13 తేదీన ఘనంగా ప్రారంభం కాబోతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగనుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించాలనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఆ కోరిక తీరే రోజు రాణే వచ్చింది. జనవరి 13 తేదీ నుంచి 45 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. దేశంలోని నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి రావడానికి సమయం ఆసన్నమైనది.

కుంభమేళా జరిగే 45 రోజులు పవిత్రమైనవి. ఈ 45 రోజులు త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తారు. కానీ 45 పవిత్రమైన రోజుల్లో మరో ఆరు రోజులు అత్యంత పవిత్రమైనవని వేదం పండితులు చెబుతున్నారు. ఈ ఆరు రోజుల్లో ఏరోజైనా పవిత్రమైన గంగా నదిలో స్నానమాచరిస్తే మోక్షము సిద్ధిస్తుందని వేదంలో చెప్పబడింది.

45 రోజులు గంగానదిలో స్నానం చేయడానికి భక్తులు రావడానికి సిద్ధమయ్యారు. మరి కొందరు అతి పవిత్రమైన ఆరు రోజుల్లో స్నానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆ ఆరు రోజులు ఏమిటంటే…. జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి రోజుల్లో స్నానమాచరిస్తే మోక్షము సిద్ధిస్తుందని వేదపండితులు చెబుతున్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.