INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
సింగరేణి కార్మికుల సమస్యలపై INTUC సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ సింగరేణి డైరెక్టర్ (పా)ను కలిసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా మెడికల్ బోర్డును ప్రతి నెలా నిర్వహించాలని కోరగా,ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించడానికి డైరెక్టర్ అంగీకరించినట్టు జనక్ ప్రసాద్ ” కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి” కి బుధవారం తెలిపారు. మెడికల్ బోర్డుకు అర్హత ఉన్న కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జనక్ ప్రసాద్ కార్మిక వర్గాన్ని కోరారు.

