Home » పాఠశాలలకు వేసవి సెలవులు పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం

పాఠశాలలకు వేసవి సెలవులు పొడగించిన రాష్ట్ర ప్రభుత్వం

  • పాఠశాలలకు వేసవి సెలవులు పొడగింపు
  • జూన్ 15న పాఠశాలల ప్రారంభం
  • రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • అధిక ఉష్ణోగ్రతలు
  • స్కూల్స్ రీఓపెన్
  • విద్యాశాఖ తాజా వార్త

కోల్ బెల్ట్ న్యూస్(మంచిర్యాల): తెలంగాణా రాష్ట్రంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను మరికొన్ని రోజులు పొడగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, తాజా నిర్ణయం మేరకు జూన్ 15న తిరిగి ప్రారంభం కానున్నాయి.

ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 13 రెండో శనివారం కాగా, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జూన్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు.

అదేవిధంగా, రెండో శనివారం సెలవుకు బదులుగా జూలై 11న తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు తాజా షెడ్యూల్‌ను గమనించి పాఠశాలల పునఃప్రారంభానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *