34 C
Munich
Wednesday, July 29, 2026

శ్రావణ మాసంలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఇవే …..

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

ఆగస్టు నెల షెడ్యూల్ విడుదల
ఆగస్టు 22, 24 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
టీటీడీ ప్రకటన

కోల్ బెల్ట్ న్యూస్ ప్రతినిధి:

తిరుమలలో కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లోనే భక్తుల రద్దీ అధికంగా ఉండగా, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన శ్రావణ మాసంలో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో నిర్వహించనున్న విశేష పర్వదినాలు, ఉత్సవాల షెడ్యూల్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

టీటీడీ ప్రకటించిన వివరాల ప్రకారం, ఆగస్టు నెలలో శ్రీవారి ఆలయంలో పలు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుండగా, శ్రావణ నక్షత్రంలో జన్మించిన మహావిష్ణువును ప్రత్యేక భక్తిశ్రద్ధలతో ఆరాధించే ఈ మాసానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.

ఆగస్టు నెలలో ప్రధాన ఉత్సవాలు
ఆగస్టు 14: శ్రీవారి పురిశైవారితోటకు వేంచేపు ఉత్సవం.
ఆగస్టు 16: నాగ చతుర్థి, కశ్యప మహర్షి వర్ష తిరునక్షత్రం కార్యక్రమాలు.
ఆగస్టు 17: గరుడ పంచమి సందర్భంగా శ్రీవారి గరుడ వాహన సేవ.
ఆగస్టు 21: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి కార్యక్రమాలు.
ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
ఆగస్టు 25: పవిత్రోత్సవాల ముగింపు.
ఆగస్టు 28: శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవతో పాటు శ్రీ విఖనస మహాముని జయంతి, శ్రీ హయగ్రీవ జయంతి ఉత్సవాలు.
ఆగస్టు 29: శ్రీవారు విఖనసాచార్యుల వారి సన్నిధికి వేంచేపు ఉత్సవం.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉండనున్న నేపథ్యంలో ఆగస్టు 22న అంకురార్పణ, ఆగస్టు 24న పవిత్రోత్సవాల సమర్పణ కార్యక్రమాల దృష్ట్యా ఆ రెండు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.

 

 

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.