34.5 C
Munich
Wednesday, July 29, 2026

ఆషాఢ మాస యాత్రలో బీబీపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు

Must read

coalbelt 24 News
coalbelt 24 Newshttps://coalbelt24news.com
COAL BELT NEWS, NIGAMA MEDIA Pvt Ltd , Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

📰 Generate e-Paper Clip

కుటుంబ సమేతంగా భద్రాచలం, పర్ణశాల, మేడారం దర్శనం… \
వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి పయనం

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బీబీపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా ఈరోజు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పర్ణశాలలోని సీతమ్మ నారచీరల స్థలం, మినీ అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించి, అక్కడి ఆధ్యాత్మిక విశిష్టతను ఆస్వాదించారు. అనంతరం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ గద్దెలను దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ యాత్రలో తదుపరి భాగంగా వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నట్లు ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కార్యదర్శి భాశెట్టి నాగేశ్వర్ తెలిపారు.

ఆషాఢ మాసం సందర్భంగా బీబీపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కుటుంబ సమేతంగా ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొని భక్తి భావంతో వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

More articles

Latest article

App Icon

Install CBN News App

Add to home screen for faster loading and latest updates.