కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట):
కామారెడ్డి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ) చందర్ నాయక్ బుధవారం బీబీపేట్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా విబిజి రామ్జీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఊటకుంటతో పాటు మహిళా సమైక్య భవనాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి, సంబంధిత అధికారులతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగాధర్, ఎంపీఓ అబ్బాగౌడ్, ఏపీఎం, ఏపీఓ, టీఏతో పాటు గ్రామ సర్పంచ్ ఎదుల్ల సాత్విక, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

