Orange : ప్రకృతిలో దొరికే ఫలములల్లో నారింజ పండు ఒకటి. ప్రతి ఫలముతో శరీరానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. కానీ నెల రోజుల పాటు నారింజ పండు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతే కాదు నెల రోజుల పాటు తిన్న వారికి నమ్మలేని విధంగా ఎంతో ఆరోగ్యముగా ఉంటారు. ఇప్పుడు ఆ నారింజ పండు గురించి తెలుసుకుందాం……
క్రమం తప్పకుండ నెల రోజుల పాటు తినడం వలన శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ పండు తినడం వలన జలుబు, దగ్గు, సీజనల్ లో వచ్చే వ్యాధుల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బరువును నియంత్రిస్తుంది. దీనిలో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది.
ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం అంతర్గతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఫైబర్, నేచురల్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణలోనూ నారింజ అద్భుతమైన మేలు చేస్తుంది. ఆరెంజ్ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.