Home » Singareni : 25న సింగరేణిలో బోనస్ చెల్లింపు

Singareni : 25న సింగరేణిలో బోనస్ చెల్లింపు

Singareni : సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఈ నెల 25న దీపావళి బోనస్ ను చెల్లించడానికి సింగరేణి యజమాన్యం నిర్ణయం తీసుకొందని సింగరేణి కార్మిక గుర్తింపు సంఘం ఏఐటీయూసీ – సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజకుమార్ తెలిపారు.

 

ప్రతి ఏటా కార్మికులకు దీపావళి బోనస్ చెల్లిస్తున్నట్టుగానే , ఈ ఏడాది కూడా చెల్లించాలని యాజమాన్యంను గుర్తింపు సంఘం హోదాలో కోరడం జరిగిందన్నారు. సంఘం విజ్ఞప్తి మేరకు సింగరేణి యాజమాన్యం అంగీక రించిందన్నారు. సంస్థలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క కార్మికుడికి రూ : 93,750 ఈ నెల 25న బ్యాంకు ఖాతాలో జమకానున్నాయని ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *