Mirchi : పిట్ట కొంచెం కూత ఘనం అంటారు. అదే విదంగా మిరపకాయ కొరికితే కారం తట్టుకోలేం. ఇందులో ఎండు మిర్చి,, పచ్చి మిర్చి రెండు రకాలు. నిత్యం మార్కెట్ లో పచ్చి మిర్చి అందుబాటులో ఉంటుంది. కానీ మిరపకాయను కూరల్లో వాడటం వరకు మాత్రమే తెలుసు. ప్రతిరోజూ మిరపకాయను కూరల్లో తినడం వలన శరీరంలోని ఏ అవయానికి మేలు చేస్తుందో చాలా మందికి తెలియదు.
కూరల్లో నిత్యం వాడటం వలన కడుపు నొప్పి, జీర్ణ సమస్య లను నివారిస్తుంది. పంటి నొప్పి ఉన్నవారికి తగ్గుతుంది. చిగుళ్లు బలోపేతం అవుతాయి. దంతాలు ఆరోగ్యముగా తయారవుతాయి. బరువు తగ్గుతారు. రక్తపోటు అదుపులోకి వస్తుంది. గుండె ఆరోగ్యముగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మలవిసర్జన సక్రమంగా ఉంటుంది. కడుపులో మంట అదుపులోకి వస్తుంది. అదే విధంగా తిన్నటువంటి ఆహారం జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది.