Best fruit : శరీరం అనారోగ్యానికి గురైతే పండ్లు నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిత్యం పండ్లు తినేవారు ఎలాంటి వ్యాధికి గురికారాని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రతి రోజూ ఒక యాపిల్ తింటే ఎలాంటి వ్యాధి శరీరంకు అంటదని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు.
కానీ నేటికీ వైద్య శాస్త్రంలో మందు లేనటువంటి కాన్సర్ జబ్బు. ఆ పండు అంటేనే బయపడు తుందని నిపుణులు చెబుతున్నారు. ఆ పండు తింటే కాన్సర్ జబ్బు సోకదనే విషయం తమ పరిశోధనలో తేలిందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆ పండు పేరే సపోటా. ఇప్పుడు ఆ పండు గురించి తెలుసుకుందాం. …..
చలికాలంలో సపోటా పండ్లు ఎక్కువగా లభిస్తాయి. దీనిలో విటమిన్ ఏ, గ్లూకోజ్ అధికంగా ఉంటుంది. ఇవి శక్తిని సమకూరుస్తాయి. ప్రతిరోజూ సపోటా తింటే మలబద్దకం సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు చెబు తున్నారు. నిద్ర సమస్య రాదు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి కావలసినంత శక్తి సమ కూరుతుంది.
కిడ్నీ లో రాళ్లు కరిగిపోతాయి. గర్భిణీలు ఆరోగ్యముగా ఉంటారు. నరాల ఒత్తిడి తగ్గుతుంది. బరువు తుగ్గు తుంది. నోటి క్యాన్సర్ ను నివారిస్తుంది. ఎముకలను బలంగా తయారుచేసే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో పుష్కలంగా ఉన్నాయి. పైల్స్, విరేచనాలను నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గాయాలైతే నొప్పి, వాపు ను తగ్గిస్తుంది.