Good news : నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే, మరోవైపు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించే వారికీ ప్రభుత్వాలు అండగా నిలుస్తాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఒక శుభ వార్త ప్రకటిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది…..
రూ.6 వేల కోట్లతో నిరుద్యోగులకు ఉపాధి పథకాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఆర్థికంగా స్థిరపడేందుకు స్వయం ఉపాధి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే అర్హుల ఎంపిక, రుణ మంజూరు ప్రక్రియ చేపట్టనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
మొత్తం రూ.6 వేల కోట్ల పెట్టుబడితో పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకంలో రూ.3 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లు మంజూరు చేస్తాయి. మిగిలిన రూ.3 వేల కోట్లు బ్యాంకుల ద్వారా రుణ సాయం పొందే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 2న ఈ పథకాన్ని ప్రారంభించే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.