Sukumar : ఆర్య సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు డైరెక్టర్ గా పరిచయమయ్యాడు సుకుమార్. ఆర్య తరువాత జగడం సినిమా తీశారు. జగడం సినిమా సుకుమార్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. టాలీఫుడ్ డైరెక్టర్ లలో సుకుమార్ ఒకరయ్యారు.
మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమా తీశారు సుకుమార్. ఆ సినిమాను హాలీవుడ్ స్టైల్ లో తీశారు. ఆ సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో సైతం వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరైతే సినిమా చూసిన అనంతరం అసలు స్టోరీ అర్థం కాలేదు అని ముక్కుసూటిగా చెప్పుకున్నారు.
1 నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆ సినిమా ప్లాప్ కావడంతో సుకుమార్ కుంగిపోయారు. దింతో సినిమాలు తీయడం మానేద్దామనే నిర్ణయానికి వచ్చారు సుకుమార్. ఆ విషయాన్నీ అమెరికాలో ఇటీవల వెల్లడించారు. అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్స్ప ఈ విషయాన్నీష్టం చేశారు.
1నేనొక్కడినే సినిమా ఇండియాలో బోల్తా కొట్టినప్పటికీ అమెరికాలో మాత్రం మంచి కలెక్షన్స్ సాధించింది. ఆ కలెక్షన్ చూసిన సుకుమార్ కు ధయిర్యం వచ్చింది. అమెరికా ఆడియన్స్ వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నట్టుగా స్పష్టం చేశారు. ఇక అప్పటినుంచి సుకుమార్ వెనుదిరిగి చూడలేదు చిత్ర పరిశ్రమలో . అందుకు అమెరికా ప్రజలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు సుకుమార్.