Mehreen : కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ మెహ్రీన్ పీర్జాదా. మొదటి సినిమాతోనే ఆమె బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొంది. మొదటి సినిమా కూడా విజయవంతం అయ్యింది. కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమా తరువాత మెహ్రీన్ పీర్జాదా కు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయినప్పటికీ ఆమె ఆశించినంత విజయం దక్కలేదు.
సినిమాలకు కొద్దిరోజుల పాటు దూరంగా ఉంది. అయినా తన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది. దింతో ఆమె తన అభిమానులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. అభిమానులను నిరుత్సహపరచకుండా సోషల్ మీడియాను వేదిక చేసుకొంది.
కొత్త సంవత్సరం 2025 ను ఆమె ఒక వేదిక చేసుకొంది. కొత్త సంవత్సరం ప్రారంభం అయిన మొదటి రోజుననే ఆమె తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఆమె తన అంద, చందాలను చూపిస్తూ పలు ఫోటోలను విడుదల చేసింది. ఆ ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.