Shiridi Sai : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం కోట్ల రూపాయల్లో ఉంటుంది. కోరుకున్న కోరికలు, కష్టాలు తీరిన భక్తులు కానుకల రూపంలో హుండీలో వేస్తారు. ఆ హుండీ ఆదాయం ప్రతిరోజు కోటి రూపాయల పైననే ఉంటుందని టీటీడీ అధికార గణాంకాలు చెబుతున్నాయి. దేశంలోనే వెంకటేశ్వర హుండీ ఆదాయం ఎక్కువ అనే ప్రచారం భక్తుల్లో ఉంది.
షిరిడి సాయి నాథుడు అంటేనే అపారమైన భక్తి. ఎంత కష్టమైన జీవితంలో ఒక్కసారైనా ఆ సాయి నాథుడిని దర్శనం చేసుకోవాలి అని మనసులో కోరిక కలుగుతుంది. సాయి దర్శనానికి వెళ్లిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని భక్తుల నమ్మకం. సాయి ని నమ్ముకున్న భక్తులు హుండీలో తమ కానుకలను వేస్తుంటారు.
ఇప్పుడు షిరిడి సాయినాథుని హుండీ ఆదాయం తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామిని మించి పోయిందని సాయి అధికార గణాంకాలు చెబుతున్నాయి. సాయిబాబాను ఒక్కరోజే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారని సాయి సంస్థాన్ సీఈఓ గాడిల్కర్ ప్రకటించారు.
భక్తుల నుంచి సాయిబాబా దేవస్థానానికి దాదాపు ఆరు కోట్ల ఇరువై ఐదు లక్షల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయన్నారు. వీటిలో రూ.1.20 కోట్ల డొనేషన్లు అందాయన్నారు. సాయి మందిరం కౌంటర్లో రెండుకోట్ల యాభయ్ మూడు లక్షల హుండీ ఆదాయం, చెక్కులు, డీడీ రూపంలో ఒక కోటి తొంబై అయిదు లక్షల రూపాయల ఆదాయం, ఐదు కిలోల వెండి కూడా వచ్చిందని సాయి నాథుని అధికార గణాంకాలు ప్రకటించాయి.