Ethik : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎథిక్ అకాడమీలో శ్రీనివాస రామానుజన్ జన్మ దినోత్సవం పురస్కరించుకొని గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులచే ఏర్పాటు చేసిన యాక్టివిటీ బేస్డ్ గణిత బోధన పద్ధతులు ఏంతో ఆకట్టుకున్నాయి. గణితం అంశాలకు సంబందించిన క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ చరణ్ రెడ్డి మాట్లాడుతూ….
విద్యార్ధి దశలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సబ్జెక్టు లకంటే గణిత చాలా సులభమైనదన్నారు. గణితం అంటే భయపడతారు కొందరు. కానీ గణితంలో అత్యధికంగా మార్కులు తెచ్చుకోడానికి అవకాశాలు ఉన్నాయన్నారు. గణితంలో వందకు వంద మార్కులు సాధించడం కూడా సులభం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీమతి లక్ష్మి రెడ్డి, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు
. 

by