Rohit sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఆస్ట్రేలియా పర్యటన కలిసిరాలేదు. ఈ పర్యటనలో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. ఇటీవల అతని నాయకత్వాన్ని సైతం ప్రశ్నించడం జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటన కూడా ఒక పీడకలలా మారింది.
ఇదే సమయంలో ఓ టీం ఇండియా దిగ్గజం కూడా రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ విమర్శలతో తీవ్ర మనస్తాపానికి గురైన రోహిత్ శర్మ నేరుగా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని సమాచారం. ఈ ఫిర్యాదు కాస్త క్రికెట్ అభిమానుల్లో దుమారం లేపింది. ఆస్ట్రేలియా తో ఆడుతున్న సమయంలో ఆ క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ పై అనవసరమైన మాటలు వదిలిపెట్టినట్టు సమాచారం.
ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన అనంతరం బీసీసీఐ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రోహిత్ శర్మ పలు అంశాలపై మాట్లాడారు. అదే సందర్భంలో సునీల్ గవాస్కర్ అనవసరంగా తనపై నోరు పారేసు కున్నాడని రోహిత్ శర్మ ఫిర్యాదు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటన గురించి గవాస్కర్ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా రోహిత్ శర్మ ఆ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలిసింది.