IFTU : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి ఈ. నరేష్. మాట్లాడుతూ…
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిచో తమ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని శాంతియుత పోరాటాలు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్ ) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఏ వెంకన్న, బి అశోక్, చిలుక శంకర్, ఈదునూరి రామకృష్ణ, ఐ రాజేశం, కొల్లూరి మల్లేష్, మెరుగు చంద్రయ్య, ఈ రాజేందర్,డి బుచ్చయ్య ,బ్రతుకుల రాజన్న, డి బుచ్చమ్మ, కె మొగిలి, ఆర్ రాయమల్లు, టీ రాజేష్, బండ పద్మ, శారద ,మేరీ, సుధాకర్, రాజనర్సు, ఏ రవి, సత్యం ,ఎడ్ల రవికుమార్, ఎన్ రాజేందర్, కే ఎల్లయ్య, సమ్మక్క,గుండు రాజన్న,వీ. రాజనర్స్ తదితరులు పాల్గొన్నారు.