Kishan reddi : రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన అన్ని పార్టీల ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా బట్టి విక్రమార్క రాష్ట్రంలోని ఎంపీ లందరికి ఫోన్ చేసి ఆహ్వానించారు. రాష్ట్రము నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు బీజేపీ మంత్రులు అయినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కూడా బట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు.
బట్టి విక్రమార్క ఆహ్వానానికి మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి తన సంస్కారాన్ని నిరూపించుకున్నారు. కిషన్ రెడ్డి మనసులో ఏమైనా ఉండవచ్చు. కానీ ప్రభుత్వ పరంగా ఇచ్చిన మర్యాదను కాపాడుకున్నారు. తన గౌరవాన్ని కిషన్ రెడ్డి నిలబెట్టుకున్నారనే అభిప్రాయాలు సైతం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. బట్టి విక్రమార్క పిలుపుకు స్పందించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక లేఖ రాయడం విశేషం.
.
మీరు పంపిన లేఖ ఆలస్యంగా అందినది. ముందస్తుగా చేపట్టిన కార్యక్రమాల కారణంతో మీరు ఏర్పాటు చేసిన ఎంపీలు సమావేశానికి రాలేకపోతున్నాను అంటూ కిషన్ రెడ్డి తన లేఖలో వివరించారు. భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి కోసం ఇలాంటి సమావేశాలు నిర్వహించాలనుకుంటే ముందస్తుగా సమాచారం ఉండాలని కిషన్ రెడ్డి తన లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎల్లవేళలా సిద్దంగానే ఉంటుందని తెలిపారు. చిత్తశుద్ధి, అంకితభావంతో తెలంగాణ అభివృద్ధికి తాము కృషి చేస్తూనే ఉంటామని కూడా తన లేఖలో కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.