Gold : ఒకవైపు సూర్యుడు బగబగ మండిపోతున్నాడు. మరోవైపు బంగారం ధర వింటే కళ్ళు తిరిగిపడిపోయే పరిస్థితి కనబడుతోంది. వేసవి వేడిని అయినా తట్టుకోవచ్చేమో కానీ, బంగారం ధర మాత్రం తట్టుకొనే పరిస్థితి లేదంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు. రెండు రోజుల కిందట రూ : 98 వేల చిల్లర ఉన్న ధర సోమవారం అర్థరాత్రి ఒక్కసారిగా రూ : 1,00,015 చేరుకొంది.
ఈ ఏడాదిలోనే అంచెలంచెలుగా రూ : 21 వేలు పెరిగింది. బంగారం ధర ఇంతగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2024 జులై కంటే ముందు వరకు బంగారం, వెండిపైన 18 శాతం భారం ఉండేది. ఈ ప్రభావం మనదేశముపై పడటంతో ధరలు పెరగక తప్పడంలేదంటున్నారు ఆర్థిక నిపుణులు.
రూపాయి తో పోలిస్తే డాలర్ విలువ కూడా అధికంగానే ఉంది. దీనివల్ల కూడా బంగారం ధర పెరుగుతున్నదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.