2000 Notes : రెండువేల నోట్ల విషయంపై రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా ఒక కీలక ప్రకటన చేసింది. రద్దు చేసిన రెండువేల నోట్ల గురించి తెలిసిన విషయమే. రద్దు చేస్తున్నామని బ్యాంకు ప్రకటించగానే ప్రజల వద్ద ఉన్న నోట్లను వెంటనే బ్యాంకు లో మార్పిడి చేసుకున్నారు. అయితే రెండు వేల నోట్లు గణాంకాల ప్రకారం మొత్తం మా చేతికి రాలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
ప్రజల వద్ద నేటికీ మిగిలి ఉన్నాయని, అవి రూ : 6,181 కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు నేటికీ ఉన్నాయని ప్రకటించింది. 2023, మే 19 నాటికీ ప్రజలు బ్యాంకు లో జమచేసిన నోట్ల శాతం 98.26 మాత్రమేనంది ఆర్బీఐ. 6,181 కోట్ల విలువైన రెండువేల రూపాయల నోట్లు నేటికీ ప్రజల చేతిలో మిగిలి ఉండటంతో ఆర్బీఐ మరోసారి నోట్ల మార్పిడికి అవకాశం కలిపించే పరిస్థితి కూడా ఉందని పలువురు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.