water : ఉదయం నిద్రలేవగానే సాధారణంగా కొందరు పళ్ళు తోమిన తరువాతనే నీళ్లు తాగుతారు. కొందరు పళ్ళు తోమకుండా కూడా తాగుతారు. ఈ రెండు పద్ధతుల్లో కొందరు గోరు వెచ్చనివి, మరి కొందరు మామూలు చల్లని నీళ్లు తాగుతారు. పరిగడుపున , పళ్ళు తోమకుండా తాగడం వలన నోటిలో ఉన్న బాక్టీరియా అంత కూడా కడుపులోకి పోయి ఇబ్బందులు ఎదురవుతాయనే అపోహ కూడా ఉంది. కానీ పరిగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వలన మన శరీరానికి అనేక లాభాలు ఉన్నవని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయం నిద్ర లేవగానే ఒకటి, లేదా రెండు గ్లాస్ ల నీరు తాగడం వలన శరీరం ఎంతో ఉల్లాసంగా తయారవుతుంది. శరీరం ఆరోగ్యముగా తయారవుతుంది. అనారోగ్య సమస్యలు రావు. మలబద్దకం తొలగిపోతుంది. జీర్ణ సమస్యలు తలెత్తవు. శరీరంలో ఉన్న టాక్సిన్స్, మలిన పదార్థాలతో ఇబ్బందులు ఉంటె తొలగిపోతాయి.
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వలన చర్మ సమస్యలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా తయారవు తుంది. శరీరంలో శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. సాధారణమైన నీళ్లకు బదులు గోరు వెచ్చని నీళ్లు తాగడం వలన చాలా లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.