Garlic : వెల్లుల్లి పాయలను కేవలం వంటలకే వాడుతారు. వెల్లుల్లి వాడటం వలన కూరలు రుచిగా ఉంటాయి. ఔషధ గుణాలు కూడా బోలెడు ఉన్నాయి. వెల్లుల్లి పాయలను మూడింటిని నలపాలి. వాటిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే మీ కడుపులో ఉన్న సమస్యలన్నీ మాయం కావడం పక్కా అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం కాలీ కడుపుతో ఉన్నప్పుడే గోరువెచ్చని నేతిలో వెల్లుల్లి పాయలను వేసుకొని కలిపి తాగితే కడుపులో ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి నీరి శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. బీపీ, షుగర్ వ్యాధులు ఉన్నవారికి అదుపులో ఉంటాయి. క్రమం తప్పకుండ వెల్లుల్లి నీరు తాగిన వారికి భవిష్యత్తులో బీపీ. షుగర్ మందులు వాడాల్సిన అవసరం ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
శరీరం చురుగ్గా పనిచేస్తుంది. కడుపులో ఉన్నటువంటి మలబద్దకం, అజీర్తి, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి. పేగుల్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. వాటిలో ఉన్న వ్యర్థాలు కూడా తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.