Curd : పెరుగు అనే ఆహార పదార్థం శరీరానికి చాలా ఆరోగ్యకరమైనది. అవసరం కూడా. కూరతో భోజనం చేసిన తరువాత చివరగా పెరుగుతో రెండు ముద్దలు తింటే గాని భోజనం చేసినట్టుగా తృప్తవుతుంది. కొందరికి పెరుగు వాసన పడదు. ఆ వాసనతో వాంతులు చేసుకునే వారు కూడా ఉన్నారు. అయితే మనిషి ఆరోగ్యముగా ఉండాలంటే రోజుకు కనీసం ఎన్ని గ్రాముల పెరుగు తింటే సరిపోతుందనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతన్నారు.
పెరుగన్నం తినకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ దీర్ఘకాలంలో జీర్ణవ్యవస్థ బలహీనపడే అవకాశం ఉంది. పెరుగులో బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచేలా సహాయపడుతుంది. పెరుగు తినడం మానేస్తే శరీరం రోగాలను తట్టుకునే శక్తి కోల్పోతుంది. రోజూ పెరుగన్నం తినే వారిలో జీర్ణ సమస్యలు 30 శాతం తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.
ఆరోగ్య నిపుణుల సూచన ప్రకారం ప్రకారం ప్రతిరోజూ 100 నుంచి 150 గ్రాముల పెరుగును ఆహారంగా తీసుకోవడం మంచిదంటున్నారు. కొందరిలో జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వారు రోజుకు 50 నుంచి 75 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోరాదనీ ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.