Home » బీబీపేట్‌లో SIR అవగాహన

బీబీపేట్‌లో SIR అవగాహన

కోల్ బెల్ట్ న్యూస్ (బీబీపేట్):

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న S.I.R. (Special Intensive Revision) కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ-2 కొరివి నీరజ నరసింహులు పాల్గొని మండల వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.

2002 ఓటరు జాబితా ఆధారంగా తమ ఓటును మ్యాపింగ్ చేసుకోవాలని, అలాగే “ఒక ఆధార్ – ఒక ఓటు” అనే నినాదాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడ స్థిర నివాసం ఉంటే అక్కడే ఓటరు గుర్తింపు కార్డు ఉండేలా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని సూచించారు.

నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో మండల ప్రజలందరూ భాద్యతగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు లక్ష్మణ్, భిక్షపతి, రవి, రేణుక, జమున, చంద్రకళతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *