Singareni : సింగరేణి యాజమాన్యం అమలు చేయబోతున్న నూతన బదిలీ విధానం కు సంబందించిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ఐఎన్టియుసి మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ దేవి భూమయ్య యాజమాన్యంను డిమాండ్ చేశారు. మంగళవారం అయన యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఏరియా లోని కాసిపేట గనిపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా దేవి భూమయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ….
కార్మికుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకువచ్చిన కొత్త బదిలీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బదిలీ నిబంధనల సర్క్యులర్ నంబర్ 811 పూర్తిగా కార్మికుల అభ్యున్నతికి వ్యతిరేకంగా ఉన్నదని ఆరోపించారు. ఉద్యోగి తన సర్వీసులో కేవలం రెండు సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అవకాశం ఇవ్వడం,సరికాదన్నారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సర్క్యులర్ లేదన్నారు. ఈ విధానాలు ఉద్యోగులల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయని, కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగ భద్రతపై ప్రతికూల ప్రభావం చెప్పేవిధంగా ఉన్నాయన్నారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో సంప్రదించకుండా తీసుకొచ్చిన ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బన్న లక్ష్మన్ దాస్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ,పిట్ సెక్రెటరీ శనిగారపు రవీందర్, సోగల కన్నయ్య, కనుకుంట్ల దినేష్, సంపత్, ఏ శ్రీకాంత్, రాజ్ కుమార్, శ్రీకాంత్ ,అలీ ,రోహిత్, తదితరులు పాల్గొన్నారు.