ఫిబ్రవరి 12 న దేశవ్యాప్త సమ్మె
హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్
Singareni : అనేక పోరాటాలు చేసి కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, ఈ విధానాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 12న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్టు ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ తెలిపారు. సింగరేణిలో కూడా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిస్తూ అర్జీ వన్ డీజీఎం పర్సనల్ ఎం రవీందర్ రెడ్డి కి ఎస్ సి సి డబ్ల్యూ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న, జి ఎల్ బి.కె.ఎస్ (ఐ ఎఫ్ టీ యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్, రామగుండం రీజియన్ అధ్యక్షులు బి అశోక్
సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్బంగా నరేశ్ తో పాటు అశోక్, వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక్ విధానాలను నిరసిస్తూ అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గంతో పాటు, రైతులు మేధావులు సమ్మెలో పాల్గొనాల్సిందిగా కోరారు. కోల్పోయిన కార్మికుల హక్కులను తిరిగి సాధించుకునే వరకు కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం పోరాటాలు చేయాల్సిందిగా వారు పిలుపునిచ్చారు. కార్మిక వర్గం వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిరంతరం కార్మిక చట్టాలను అణగదొక్కుతోందని వారు ఆరోపించారు. కార్పొరేట్ శక్తులపై ఉన్న ప్రేమాభిమానాలు కార్మిక వర్గంపై లేదంటూ వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ సి సి డబ్ల్యూ యు, జీ ఎల్ బి కే నాయకులు ఈదునూరి రామకృష్ణ,జీ మల్లేశం, చింతల శేఖర్,ఎస్ ప్రసాద్, ఐ రాజేశం తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

by