Home » Singareni : 20న సింగరేణిలో సమ్మె…

Singareni : 20న సింగరేణిలో సమ్మె…

Singareni : కార్మిక వర్గం హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా సమ్మె కు పిలుపు ఇచ్చినట్టుగా గోదావరిఖనిలో కార్మిక సంఘాలు ప్రకటించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి జిడికె – 2,2ఏ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్ లో IFTU రామగుండం రీజియన్ కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, HMS రాష్ట్ర అధ్యక్షులు జక్కుల నారాయణ, IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, TSUS నాయకులు ఫయాజ్ బేగ్, TNTUC నాయకులు ఎస్ రవీందర్. లు మాట్లాడుతూ .

కార్మిక చట్టాల్లో జోక్యం చేసుకుంటే ఐక్య పోరాటాలతో కార్పొరేట్ విధానాలను పాతాళానికి తొక్కి పెడతామని హెచ్చరించారు. కార్మిక వర్గం ఐక్యతతో చేసే ఐక్య పోరాటాలలో కార్మికులంతా భాగస్వాములు కావాలని వారు ఈ సందర్బంగా కోరారు. పాలకులు తమ విధానాలను మార్చుకోకుంటే పాలకులను మార్చే శక్తి కార్మిక వర్గానికి ఉందన్నారు.

పోరాటాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను ,హక్కులను రక్షించుకోవడం కోసమీ మే 20న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో IFTU నుండి ఈ నరేష్, ఐ రాజేశం, ఎస్ ప్రసాద్, ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్, HMS నుండి సంపత్, సత్యం, ఆర్ సంజీవ్, గుజ్జుల స్వామి, శంకరయ్య, సంతోష్, TNTUC నాయకులు రాజబాబు, తదితరులు పాల్గొన్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *