కోల్ బెల్ట్ ప్రతినిది
లోకసభ ఎన్నికలను బిజెపి ప్రతిష్టాత్మకంగా తీసుకొంది.మూడోసారి కూడా అధికారాన్ని చేపట్టాలని ప్రధాన కాంగ్రెస్ పార్టీ తోపాటు ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలకు చిక్కకుండా ప్రణాళికలు రూపొందిస్తోంది.400 సీట్ల సాధనే లక్ష్యంగా పెట్టుకొంది బీజేపీ. బీజేపీ తో తలపడుతున్న పార్టీల ప్రచారం జోరందుకుంది. హామీలను కురిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి ఒకడుగు ముందుకు వేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే దీటైన మేనిఫెస్టో ను విడుదల చేసి ఓటర్లను ఆకట్టు కోవాలని ప్రయత్నిస్తోంది. సంకల్ప పత్రాన్ని విడుదల చేయడానికి బీజేపీ ముహుర్తాన్ని ఖాయం చేసినట్టుగా పార్టీ శ్రేణుల సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సారథ్యంలో ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు,మోది కి నమ్మిన బంటులు అమిత్ షా,రాజనాథ్ సింగ్ ల ఆధ్వర్యంలో మేనిఫెస్టో ను విడుదల చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం. వికసిత్ భారత్ థీమ్ 2047 తో మేనిఫెస్టో ను విడుదల చేయనున్నారని తెలిసింది.
మేనిఫెస్టో కమిటీ….
బిజెపి అధిష్టానం మేనిఫెస్టో నిర్మాణం కోసం జాతీయ స్థాయి నాయకులతో సంఘ్ పరివార్ తో కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఆధ్వర్యంలో 27 మంది తో కమిటీని ఏర్పాటు చేసారు. ఈ కమిటీ ఈపాటికే రెండు దఫాలుగా సమావేశమై పలు నిర్ణయాలు తీసుకోంది. మేనిఫెస్టో నిర్మాణంలో ప్రజల ఆలోచనలను కూడా పరిగణలోకి తీసుకొంది. సుమారు 16 లక్షల పైబడి ప్రజలనుంచి సూచనలు రావడం జరిగింది. ఐదు లక్షల పైబడి అభిప్రాయాలను ప్రజల నుంచి పార్టీ స్వీకరించింది. ఇందు కోసం ప్రత్యేకంగా నమో యాప్ ను పార్టీ ఏర్పాటు చేసింది.ప్రజల సలహాలు, సూచనలు,పార్టీ,దాని అనుబంధ సంఘాల నాయకుల సలహాలు,సూచనలు కూడా పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 న మేనిఫెస్టో ను విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు అయ్యిందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-