Water : ఉదయాన్నే కొందరు కేవలం గోరు వెచ్చని నీటిని తాగుతారు. మరి కొందరు నీటిలో తేనె, నిమ్మ రసం కలిపి తాగుతారు. కానీ మామూలు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగితే శరీరంలో జరిగే మార్పులు గమనిస్తే ఆశ్చర్య పోతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కండరాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. సోడియం, పొటాషియం, మాగ్నీషియం లాంటి ఖనిజాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. తిమ్మిరి, నరాల బిగుతు వంటి సమస్యలు ఏర్పాడినప్పుడు ఉప్పునీరు తాగితే ఉపశమనం కలుగుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఉప్పులో ఉండే సోడియం శరీరంలోని నీటిని నిల్వ ఉంచేలా సహాయపడుతుంది.ఉప్పునీరు తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయిలను సరిగ్గా ఉంచి జీర్ణక్రియ మెరుగుపరచగలదు. మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఉప్పునీరు తాగరాదు. నీరసం అలసట సమస్యలు తగ్గి శరీరం ఉల్లాసంగా ఉంటుంది.