Actor : ముందుగా అందాల పోటీలో తమ టాలెంట్ చూపిస్తారు. ఆ తరువాత ఆ అందంతో సినిమా రంగంలో అడుగుపెడతారు ముద్దుగుమ్మలు. సినిమా రంగంను వదిలేసి కొందరు పెళ్లిపీటలు ఎక్కుతారు. పెళి తరువాత కొందరు ఇంటికే పరిమితం అవుతారు. కానీ ఒక అందాల ముద్దుగుమ్మ మాత్రం వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. కోట్లాది రూపాయల ఆస్థికి వారసురాలు అయ్యింది.
1990 లో ఆమె తెలుగు, హింది చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోయిన్. వెంకటేశ్, మహేష్ బాబు, షారుఖ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకొంది. పెళ్లి తరువాత సినిమాలను పక్కన పెట్టేసింది. 2008 లో వ్యాపారం చేయడానికి నిర్ణయం తీసుకొంది. అప్పటి వరకు ఏ మహిళా కూడా క్రికెట్ రంగంలో పెట్టుబడి పెట్టలేదు. క్రికెట్ జట్టుకు పెట్టుబడి పెట్టిన మొట్టమొదటి మహిళ ఆమె కావడం విశేషం.
ఆమె ఎవరంటే ప్రీతి జింటా. 2008లో IPL లో ఆమె ఏకైక మహిళా జట్టు యజమాని కావడంతో చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అయ్యింది. ముగ్గురుతో కలిసి కింగ్స్ XI పంజాబ్ జట్టుకు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు ఈ జట్టు విలువ సుమారుగా రూ.7775 కోట్లు. క్రికెట్ జట్టు కొనుగోలుతో పాటు నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. సినిమాలను వదిలిపెట్టి పూర్తిగా వ్యాపారరంగంలోనే స్థిరపడిపోయింది.