Rs :50 : బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. పొదుపు చేసేవారికోసం కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతులకు, వ్యాపారస్తులకు కూడా పలు పథకాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతి రోజు యాబై రూపాయలు పెట్టబడితో లక్షల్లో ఆదాయం వచ్చే పథకాన్ని కూడా ప్రవేశ పెట్టింది. ఈ పథకానికి మహిళలు, పురుషులు కూడా అర్హులే. వయసుతో సంబంధం లేదు.
కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. పథకం పేరు రీకరింగ్ డిపాజిట్. ఈ పథకంలో రోజుకు 50 రూపాయలు పెట్టుబడి. అంటే మీ పెట్టుబడి నెలకు రూ : 1500 అవుతుంది. ఒక సంవత్సరానికి రూ : 18,000 అవుతుంది. ఇదే విదంగా ఐదేళ్లకు మీ పెట్టుబడి రూ : 90,000 అవుతుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వడ్డీ ప్రకారం మీ పెట్టుబడికి రూ : 17,500 వస్తుంది. ఐదేళ్లకు మీ పెట్టుబడి అసలు, వడ్డీ కలుపుకొని కలుపుకొని రూ.1,07,500 వస్తుంది. తీసుకోకుండా మరో 10 ఏళ్లు పొడిగిస్తే అప్పుడు మీ చేతికి రూ.2,56,283 అవుతుంది