Home » Telangana : కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ నోటీసులు

Telangana : కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ నోటీసులు

Telangana : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు సైతం కమిషన్ నోటీసులు జారీచేసింది.

బీఆర్​ఎస్​ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు కాళేశ్వరం విచారణ కమిషన్​ జస్టిస్​ పీసీ ఘోష్​ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్​తో పాటు మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​లకు సైతం జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ నోటీసులు ఇచ్చింది.

కేసీఆర్​ కేబినెట్ లో హరీశ్​రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఆర్థికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్​ పని చేశారు. జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈ ముగ్గురు కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు 15 రోజులు గడువును జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ ఇచ్చింది.ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *