Telangana : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ కు సైతం కమిషన్ నోటీసులు జారీచేసింది.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీశ్రావు, ఈటల రాజేందర్లకు సైతం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది.
కేసీఆర్ కేబినెట్ లో హరీశ్రావు నీటిపారుదలశాఖ మంత్రిగా ఆర్థికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పని చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. ఈ ముగ్గురు కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు 15 రోజులు గడువును జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది.ఇప్పుడు ఈ విషయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.