Pension : ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు వారు పదవీ విరమణ పొందిన తరువాత ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ ఇస్తుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ పదవి విరమణ పొందిన తరువాత ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి పెన్షన్ ఉండదు. వారికి వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం 2004 లో ఒక కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే ప్రైవేట్ ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన తరువాత వృద్ధాప్యంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు.
కానీ 2004 లో ప్రవేశపెట్టినప్పటికీ ఈ పథకంలో ప్రైవేట్ ఉద్యోగులను పెన్షన్ కోసం ప్రవేశ పెట్టింది. 2009 నుంచి ప్రైవేట్ ఉద్యోగులను పెన్షన్ పథకంలో చేర్చింది. ఈ పెన్షన్ పథకంలో ప్రైవేట్ ఉద్యోగి 40 ఏళ్ల వయసు ఉన్న వారు చేరవచ్చు. జాతీయ పెన్షన్ పథకం లో చేరిన వారు పెన్షన్ పొందుటకు అవకాశం ఉంది.
ఈ పథకంలో చేరాలంటే ప్రైవేట్ ఉద్యోగి వయసు 40 నిండి ఉండాలి. ఆ ఉద్యోగి ప్రతి నెల రూ: 20 వేలు డిపాజిట్ చేయాలి. ఇలా ఇరువై సంవత్సరాల పాటు ప్రతి నెల ఇరువై వేల రూపాయల చొప్పున జాతీయ పెన్షన్ పథకం లో చేరిన వారికి పెన్షన్ పొందుతారు. ఇలా ఈ పథకంలో చేరిన వారికి ప్రతినెలా రూ : ఒక లక్ష పెన్షన్ పొందుతారు.