Power : దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. అయినప్పటికీ కొన్ని గ్రామాలకు నేటికీ విద్యుత్ సౌకర్యం లేదు. అలాంటి గ్రామాల్లో మరొక గ్రామం కూడా విద్యుత్ వెలుగులకు నోచుకోలేదు. కరెంట్ వెలుగులు అంటే తెలియని గ్రామం ఇప్పుడు ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు మెరిసిపోతున్నాయి. ఇప్పడు ఆ గ్రామం విద్యార్థులు రాత్రి సమయంలో కూడా చదువుకుంటున్నారు.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి 50 కిలో మీటర్ల దూరంలో చిల్కపల్లి అనే గ్రామం ఉంది. ఈ గ్రామం పూర్తిగా మారుమూల గ్రామంలోనే ఉంది. ఇప్పటి వరకు ఆ గ్రామానికి విద్యుత్ సౌకర్యం లేదు. ఆ ఊరికి వెళ్లాలంటే అనేక కష్టాలు పడాలి. అయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అంతా నాలుగు నెలల పాటు శ్రమించారు. విద్యుత్ లైన్ వేశారు. జనవరి 23 నాటికే పనులు పూర్తి చేశారు.
ఛత్తీస్ ఘడ్ లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టిన నాటి నుంచి మారుమూల గ్రామాల సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే చిల్కపల్లి గ్రామంలో విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి అధికారులను సిద్ధం చేసింది. అధికారులు అంత సమిష్టి కృషి తో నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసి విద్యుత్ వెలుగులతో గ్రామాన్ని నింపారు.