Wait : అధిక బరువు తో ఆయాసపడుతున్న వారు చాలా మంది ఉంటారు. బరువు ఉండటంతో ఆయాస పడుతుంటారు. బరువు పెరగడం వలన అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి అధిక బరువు తగ్గించు కోవాలనుకునే వారు ఈ విదంగా మూడు పూటలు ఆహారం తింటే ఎంత బరువున్నా తగ్గిపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఉదయం పూట అల్ఫాహారం తినేవారు ఉదయం నట్స్, గుమ్మడి గింజలు, చియా, అవిశెలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకోవడం మంచిది. వీటిని ఉదయం పూట తింటే మధ్యాహ్నం వరకు ఆకలి కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్నం పూట భోజనంతోపాటు వెన్న తీసిన మజ్జిగ తాగడం మంచిది. అన్నం, పప్పు తినాలి. లేదంటే జొన్న రొట్టె, కూర తినడం వలన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. సాయంత్రం సలాడ్ తీసుకోవాలి.
రాత్రి పూట శనగలు లేదా అలసందలు తినాలి. నిమ్మరసం తాగితే పొట్ట నిండుగా ఉంటుంది. మిశ్రమ కూరగాయల జ్యుష్ తాగితే రాత్రి పూట ఆకలి కాదు. ఈ జ్యుస్ శరీరానికి కావలసినంత శక్తినిస్తుంది. ఈ పద్ధుతులను పాటించడం వలన శరీరానికి కావలసినంత శక్తిని ఇస్తాయి. బరువు తగ్గిస్తాయి. అదే విదంగా బీపీ, షుగర్ రాకుండ శరీరాన్ని అదుపులో ఉంచుతాయి.