Water : మూత్ర విసర్జన చేయగానే వెంటనే నీరు తాగరాదు. వెంటనే నీరు తాగితే మూత్ర పిండాలపై భారం పడుతుంది. మూత్రాశయం పై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి మూత్ర విసర్జన చేయగానే నీరు తాగరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భోజనం ముగిసిన వెంటనే నీరు తాగరాదు. కూర్చొని మాత్రమే నీరు తాగాలి. పరిగెత్తడం పూర్తయిన వెంటనే నీరు తాగరాదు. పండ్లు తిన్న తరువాత కూడా వెంటనే నీరు తాగరాదు. మామూలు చల్లగా ఉన్న నీటిని మాత్రమే తాగాలి.
భోజనం చేసిన తరువాత కానీ, మూత్ర విసర్జన చేసిన తరువాత కానీ, ఏదయినా ఆహార పదార్థాలు తిన్న తరువాత కానీ, వ్యాయామం చేసిన తరువాత కానీ కనీసం 20 నుంచి 30 నిమిషాల తరువాతనే నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అదేవిదంగా రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. వేసవి కాలంలో కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.