Home » Thirupathi : ఉత్తర ద్వార దర్శనంకు రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారో తెలుసా ?

Thirupathi : ఉత్తర ద్వార దర్శనంకు రోజుకు ఎన్ని లడ్డూలు తయారు చేస్తున్నారో తెలుసా ?

Thirupathi : తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ముస్తాబవుతున్నాయి. ఆ ఏడుకొండల వెంకన్నను ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలగబోతోంది. ఉత్తర ద్వార దర్శనం జనవరి పదో తేదీ నుంచి 19 తేదీ వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి దర్శనం చేసుకోడానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

దర్శనం కోసం టికెట్ పొందిన వారికి మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. దర్శనం కోసం వస్తున్న భక్తుల సౌకర్యార్థం సాధారణ దర్శనం రద్దు చేశారు. అదే విదంగా వసతికి సంబంధించిన గదుల అడ్వాన్స్ బుకింగ్ కూడా అధికారులు రద్దు చేశారు. ఉత్తర ద్వార దర్శనంకు వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తాగునీరు, వసతి, వెంగమాంబ సత్రంలో భోజనం, అల్పహారం ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం అధికారులు.

అయితే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వడానికి కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిరోజు సుమారు 70 నుంచి 80 వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.ఉచిత లడ్డు ప్రసాదం తీసుకోవడంతో పాటు అదనంగా కూడా భక్తులు కొంటారు. వారందరి కోసం టీటీడీ రోజుకు మూడున్నర లక్షల లడ్డూలను లడ్డు కౌంటర్ లో ఉంచడానికి ఏర్పాట్లు చేస్తోంది. వీటితో అదనంగా మరో మూడున్నర లడ్డూలను కూడా అందుబాటులో ఉండే విదంగా తయారు చేస్తున్నారు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *