TGPSC : ఎమ్మెల్యేల కొనుగోలుకే పరిమితమైన సీఎం రేవంత్ రెడ్డి
…….నిరుద్యోగులను గాలికి వదిలేసిన ప్రభుత్వం
…….కెసిఆర్ నియమకాలను తనివిగా చెప్పుకొంటున్న సీఎం
…….తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి
…….విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ..విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు TGPSC కార్యాలయాన్ని ముట్టదించాయి. సమాఖ్య నాయకులు, కార్యకర్తలు TGPSC కార్యాలయం ముందు ఆందోళనకు చేపట్టాయి. ఈ సందర్భంగా విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలు చేసిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలొనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి..ఇప్పుడు నిరుద్యోగులను పూర్తిగా గాలికొదిలేశారని ఆరోపించారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి.. నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అయన ఆరోపించారు.తేదీలతో సహా కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు.
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..అధికారంలోకి వచ్చి, 6 నెలలైనా ఉద్యోగాల ఊసేత్తడం లేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ..వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికైనా 2 లక్షల ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్లు ఇవ్వాలని విద్యార్తి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.
గ్రూప్-2లో 2,000 వరకు, గ్రూప్-3 లో 3000 వరకు పోస్టులని సవరించాలని, గ్రూప్-1 మెయిన్ పరీక్షకు 1:100 నిష్ప త్తిలో అభ్యర్థులను పిలవాలని పలువురు నాయకులు ఈ సందర్బంగా మాట్లాడుతూ డిమాండ్ చేశారు.డీఎస్సీలో కూడా 11 వేల పోస్టులను 25వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో 46ను వెంటనే రద్దు చేయాలని అదేవిదంగా ఈ ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ను తక్షణమే ప్రకటించి, నిరుద్యోగులకు ప్రతినెల రూ.4,000 నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొంపెళ్లి రాజు, ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ ఎల్చాల దత్తాత్రేయ, ఓయూ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ నాయకులు మన అశోక్ యాదవ్, లింగం శాలివాహన, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు జక్కుల మధు తదితరులు పాల్గొన్నారు.