schemes : స్వయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకునే మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధినిచ్చే పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టింది. ఈ పథకాలకు పలు బ్యాంకులు సైతం రుణాలు మంజూరు చేయనున్నాయి. పారిశ్రామికంగా ఎదగాలనుకునే మహిళలకు ఇది ఒక సువర్ణావకాశం.
కళ్యాణి పథకం …. భారత దేశంలోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయడానికి ప్రారంభించిన పథకం. ఈ పథకాన్ని సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే ప్రారంభించిన వారితో పాటు, కొత్తగా ప్రారంభించాలనుకునే మహిళలకు ఈ పథకం చాలా ఉత్తమమైనది.
ఉద్యోగిని …. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దేశంలోని మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. వార్షికాదాయం రూ ; 40 వేలు ఉన్న మహిళలు బ్యాంకు లో ఒక లక్ష రూపాయలు ఋణం పొందే అవకాశం ఉంది. తక్కువ వడ్డీకే ఋణం లభిస్తుంది.
మహిళా శక్తి యోజన : ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రవేశ పెట్టింది. ఈ పథకం ద్వారా రెండు లేదా అంత కంటే ఎక్కువ లక్షల రూపాయల రుణాన్ని పొందడానికి అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ఋణం పొందిన మహిళలకు రాయితీ కూడా ఉంది.
ముద్ర యోజన :ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ముద్ర పథకం ద్వారా మహిళలకు రూ : 10 లక్షల వరకు ఋణం పొందడానికి అవకాశం ఉంది. తక్కువ నిబంధనలతో ఋణం పొందవచ్చు. ఎలాంటి గ్యారంటీ అవసరం లేకుండానే ఋణం పొందడానికి అవకాశం ఉంది.
అన్నపూర్ణ పథకం …. ఈ పథకం ఫుడ్ మరియు క్యాటరింగ్ పథకాలను ప్రారంభించే వారికి అనుకూలం. బ్యాంకు లో రూ : 50 వేల వరకు ఋణం పొందవచ్చు. 36 వాయిదాల్లో ఋణం చెల్లించాలి. ఈ పథకం కింద ఋణం పొందే వారు బ్యాంకు లో గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.