Singareni : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి కాసిపేట గని ఆవరణలో శనివారం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కాసిపేట గని మహిళా కార్మికులను ఉన్నతాధికారులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గని మేనేజర్ భూశంకరయ్య మాట్లాడుతూ……
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రక్షణ అధికారి నిఖిల్ మాట్లాడుతూ ఇంటిలో ఉండే మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. AITUC బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేష్ మాట్లాడుతూ మహిళలు విద్య ద్వారానే మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని,అనంతరం ఆర్థికంగా బలపడుతారని అన్నారు.
INTUC కేంద్ర కమిటీ ప్రచార కార్యదర్శి బన్న లక్ష్మన్ దాస్ మాట్లాడుతూ ఆకాశమే హద్దుగా ముందుకు వెళుతున్న మహిళలు నింగి,నేలను శాసిస్తున్నారని, అంది వచ్చిన అవకాశాలను అన్ని రంగాలల్లో రాణిస్తున్నారని అన్నారు. పిట్ సెక్రటరీ మీనుగు లక్ష్మినారాయణ మాట్లాడుతూ మహిళలకు పురుషుల తో సమాన అవకాశాలు వస్తున్న నేపథ్యంలో, వారు అన్ని రంగాలలో పోటీ పడాలని అన్నారు, TBGKS పిట్ సెక్రటరీ బైరి శంకర్ మాట్లాడుతూ ఉద్యోగ, విద్య, సాంకేతిక రంగాలలో మహిళలు ముందుంటున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి వెంకటేష్, ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ వెంకటేష్, సంక్షేమ అధికారి మీర్జా, సర్వేయర్లు ఖాన్, రామకృష్ణ, నాయకులు సోల్లంకి శ్రీనివాస్, రంజిత్, అశోక్, సురేష్, నాగేశ్వరరావు, కృష్ణ, మైఖేల్, లింగయ్య, సతీష్, అబ్దుల్, రఘు రామ్, మహిళ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.