Water : ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉండి నీళ్లు తాగుతారు. కొలత అంటూ ఏమి ఉండదు. కొందరు నిమ్మకాయ రసం కలిపిన నీరు తాగుతారు. మరికొందరు గోరువెచ్చని నీరు తాగుతారు. ఇంకొందరు బెల్లం నీరు తాగుతారు. వీటన్నిటి కంటే మరొకటి ఆరోగ్యానికి మంచి చేసే నీరు ఉంది. ఆ నీటిని పరిగడుపున తాగితే మన శరీరానికి ఎలాంటి అనారోగ్యం దరిచేరదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ నీరే పసుపు నీరు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజూ ఒక గ్లాసు నీటిలో ఇంటిలో తయారు చేసిన ఒక చెంచా స్వచ్ఛమైన పసుపు పొడిని వేసుకొని తాగండి. ఈ విదంగా తాగడం వలన గుండె జబ్బుల ప్రమాదం తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యముగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గి రక్తపోటు అదుపులో ఉంటుంది.
రక్తం శుద్దిచేయ బడుతుంది. శరీరంలోని విషపదార్తాలను తొలగిస్తుంది. గాల్ బ్లాడర్ పనితీరు మెరుగవుతుంది.క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికడుతుంది. కడుపులో మంటగా ఉంటె తగ్గిపోతుంది. క్యాన్సర్ ను నిరోధించే శక్తి పసుపు కు ఎక్కువగా ఉంది. జీర్ణ శక్తి మెరుగవుతుంది. మలబద్దకం సమస్య ఉండదు. శరీరం బరువు అదుపులో ఉంటుంది.