కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీఆర్ఎస్ మందమర్రి పట్టణ అధ్యక్షుడు జే. రవీందర్ కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మంగళవారం మందమర్రిలోని రవీందర్ నివాసానికి వెళ్లిన మంత్రి, ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
అనంతరం రవీందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ, వారి దుఃఖంలో తాను భాగస్వామినని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాండ్ల సమ్మయ్య, గుడ్ల రమేష్తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});