CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 9:46 pm Posted By: coalbelt 24 News

మియాపూర్‌లో పేలుడు.. నలుగురికి గాయాలు

ఐస్‌క్రీమ్‌ బండి నిర్వాహకుడి పరిస్థితి విషమం

కోల్ బెల్ట్ న్యూస్ (హైదరాబాద్):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మియాపూర్‌లోని జీఎస్‌ఎం మాల్‌ సమీపంలో శనివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిలో ఐస్‌క్రీమ్‌ బండి నిర్వహిస్తున్న యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పేలుడులో గాయపడిన వారిలో ఓ కాలేజీ విద్యార్థిని, ఓ ఐటీ ఉద్యోగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పేలుడు ఎలా సంభవించింది, ఇందులో ఎవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});