CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 6:43 pm Posted by : coalbelt 24 News

ప్రమాదకరంగా మారిన బీబీపేట్ వంతెన……

కొత్త బ్రిడ్జి నిర్మించాలి
వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు..
ప్రమాదాలకు కేంద్రంగా మారిన రహదారి..
వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు

కోల్ బెల్ట్ న్యూస్(బీబీపేట):




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఉన్న వంతెన ప్రమాదకరంగా మారిందని, వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింహులు డిమాండ్ చేశారు.

గత వర్షాకాలంలో వంతెన దెబ్బతినడంతో రహదారి పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం ప్రారంభం కావడంతో రోడ్డంతా భారీ గుంతలతో నిండిపోయిందని ఆయన తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల ప్రాణాలకు సంబంధించిన సమస్యను రాజకీయాలకు అతీతంగా చూడాలని, అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజల సమస్యలు గుర్తొచ్చే పరిస్థితి ఉండకూడదని, ఇలాంటి నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రజల్లో ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

బీబీపేట్ నాలుగు జిల్లాలైన కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, మెదక్ జిల్లాలను కలిపే ప్రధాన కూడలిగా ఉండటంతో ప్రతిరోజూ వేలాది మంది ఈ రహదారిపై ప్రయాణిస్తుంటారని తెలిపారు. ఇంత కీలకమైన రహదారిని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని అన్నారు.

బీబీపేట్ గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా ప్రమాదకరంగా మారిన వంతెన స్థానంలో వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టి, రహదారిని శాశ్వతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});