CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 4:06 pm Posted by : coalbelt 24 News

మందమర్రిలో 29న గురుపౌర్ణమి వేడుకలు

కోల్ బెల్ట్ న్యూస్(మందమర్రి):

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో ఈ నెల 29వ తేదీన గురుపౌర్ణమి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి శ్రీకర్, కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గురుపూజ, భజన కార్యక్రమాలు, హారతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నాయని, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురుపౌర్ణమి వేడుకలకు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సాయిబాబా ఆశీస్సులు పొందాలని ఆలయ పూజారి, కమిటీ సభ్యులు కోరారు.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});