Singareni : 11 న బిఎంఎస్ బహిరంగ సభ

Singareni : మంచిర్యాల జిల్లా లోని సీసీసీ కార్నర్ వద్ద ఈనెల 11న సాయంత్రం నాలుగు గంటలకు బిఎంఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ ఆదివారం తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథి జాతీయ బొగ్గు పరిశ్రమల ఇంచార్జి కొత్త కాపు లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు. సభకు భారతీయ మజ్దూర్ సoగ్ (బి.ఎమ్.ఎస్) అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మికులు, మంచిర్యాల పరిసర ప్రాంత సంఘటిత, అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని...