CoalBelt 24News
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 3:01 pm Posted by : coalbelt 24 News

Business : వ్యాపారస్తులకు కమిషన్ వచ్చే పథకాన్ని ప్రకటించిన కేంద్రం

Business : వ్యాపారస్తుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. వ్యాపార రుణాలు, ఇన్సూరెన్స్, వ్యాపారం అభివృద్ధి కోసం పథకాలను ప్రవేశ పెట్టింది. ఇప్పుడు మరో సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు చేసిన కొనుగోలుపై వ్యాపారస్తులకు కమిషన్ వచ్చే పథకాన్ని కొత్తగా ప్రవేశ పెట్టింది. ఈ పథకం కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులకు ఏ విధంగా కమిషన్ రూపంలో ఆదాయం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం…..

UPI చెల్లింపులపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. UPI ద్వారా చెల్లింపులను అంగీకరించిన వ్యాపారస్తులకు భారీ ప్రయోజనాలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. UPI ద్వారా చెల్లింపులు తీసుకుంటే చిరు వ్యాపారులు అదనంగా డబ్బు సంపాదించే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకొంది. వినియోగదారులు రూ : 2,000 వరకు కొనుగోలు చేస్తే చిరు వ్యాపారులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఒక వినియోగదారుడు రూ. 1000 వస్తువులను కొనుగోలు చేసి UPI ద్వారా చెల్లింపులు చేస్తే, దుకాణదారుడికి రూ. 1.5 ప్రోత్సాహకం లభిస్తుంది. దీంతో పాటు, బ్యాంకులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చే విదంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

Author




(adsbygoogle = window.adsbygoogle || []).push({});